News

కేంద్రం నుంచి తెలంగాణ రూ.1,666 కోట్లు


కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అన్నివిధాలా సహకారం అందుతుందని చెప్పారు. మంగళవారం కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ని దత్తాత్రేయ కలిశారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ.. తెలంగాణకు ఉపాధిహామీ పథకం కింద 2016-17 సంవత్సరానికి రూ.1,666 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. త్వరలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్‌ యోజన కింద 2015-16కి సంబందించిన రూ. 142 కోట్లు విడుదల చేయనుందన్నారు. పెండింగ్ నిధులు కూడా త్వరలో విడుదలవుతాయని, పుర ప్రాజెక్ట్‌పై హైదరాబాద్‌లో నరేంద్ర సింగ్ తోమర్ సమీక్షిస్తారని చెప్పారు.